న్యూఢిల్లీ: ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్గా సుధీర్ రహేజా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్ల పదవీ కాలంతో గతేడాది జనవరిలో ఏఏఐ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఆర్ కే శ్రీవాత్సవను కేంద్ర ప్రభుత్వం అర్థాంతరంగా పదవి నుంచి తప్పించింది. దీంతో ఆయన బాధ్యతలను సుధీర్ రహేజాకు అప్పగించింది.