జీపీఎఫ్‌ వడ్డీరేటు యథాతథం

25 Oct, 2017 14:00 IST|Sakshi


సాక్షి, న్యూఢిల్లీ:  జీపీఎఫ్‌ (ఉద్యోగుల భవిష్యనిధి)పై ఇచ్చే వడ్డీని యథాతధంగా కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జిపిఎఫ్) ఇతర సంబంధిత పథకాలకు 7.8 శాతం వడ్డీ రేటును చెల్లించనున్నట్టు ప్రభుత్వం  తెలిపింది. ఈ  వడ్డీరేటు అక్టోబర్‌ 1నుంచి డి సెంబర్‌ 21, 2017 వరకు వర్తిస్తుందని పక్రటించింది.  కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే, రక్షణ బలగాల భవిష్య నిధిపై ఈ  వడ్డీరేటు వర్తిస్తుందని ప్రభుత్వం ఒక  ప్రకటనలో తెలిపింది.

గత నెలలో,ఇతర భవిష్యనిధి పథకాలైన పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌)  చిన్న పొదుపు పథకాల వడ్డీరేటులో ఎలాంటి మార్పు చేయకుండా అక్టోబర్-డిసెంబరులో 7.8 శాతంగా ఉంచింది.
 

మరిన్ని వార్తలు