ముచ్చటగా మూడోసారి రూ.లక్ష కోట్లు

31 Jan, 2019 18:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  జీఎస్‌టీ వసూళ్లు మరోసారి రూ. లక్ష కోట్ల వసూళ్లను దాటాయి. జనవరి  మాసానికి సంబంధించి లక్ష కోట్ల రూపాయల మార్కెను అధిగమించాయని  ఆర్థికమంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది.  గతనెల రూ. 94, 725 కోట్ల రూపాయలతో పోలిస్తే , గత ఏడాది ఇదే నెలలో నమోదైన రూ. 89, 825కోట్లతో  పోలిస్తే జనవరిలో ఈ వసూళ్లను సాధించినట్టు ట్వీట్‌ చేసింది.

కాగా గత ఏడాది  ఏప్రిల్‌లో తొలిసారి లక్షకోట్ల రూపాయలను దాటాయి. అనంతరం  మళ్లీ అక్టోబర్‌  రెండవసారి ఈ  మైలు రాయిని దాటాయి.  రెండు నెలల విరామం తరువాత తిరిగి జనవరి మాసంలో ముచ్చటగా మూడోసారి జీఎస్‌టీ వసూళ్లు లక్షకోట్ల మార్క్‌ను దాటాయి. 

మరిన్ని వార్తలు