జనవరిలో కొత్త మొబైల్‌ యూజర్లు@51 లక్షలు

18 Feb, 2017 03:29 IST|Sakshi
జనవరిలో కొత్త మొబైల్‌ యూజర్లు@51 లక్షలు

న్యూఢిల్లీ: మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల పెరుగుదల జనవరిలో 51.1 లక్షలుగా ఉందని టెలికం పరిశ్రమ సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. గతేడాది డిసెంబర్‌లో నమోదైన కొత్త సబ్‌స్క్రైబర్ల (81.8 లక్షలు)తో పోలిస్తే ఈ సంఖ్య తక్కువని తెలిపింది. దేశంలోని మొత్తం జీఎస్‌ఎం సబ్‌స్రైబర్ల సంఖ్య జనవరిలో 81.51 కోట్లకు చేరిందని పేర్కొం ది. దీనికి రిలయన్స్‌ జియో యూజర్లు అదనం. ఎయిర్‌టెల్‌ యూజర్ల సంఖ్య 35.5 లక్షల పెరుగుదలతో 26.94 కోట్లకు చేరింది. 2016 డిసెంబర్‌ 31కి జియో యూజర్ల సంఖ్య 7.24 కోట్లు.

మరిన్ని వార్తలు