ఫిబ్రవరి 1 నుంచే ఇ-వే బిల్లు

16 Dec, 2017 13:36 IST|Sakshi

జీఎస్‌టీ కౌన్సిల్‌    కీలక  నిర్ణయం  తీసుకుంది. జీఎస్‌టీ పన్ను పరిధిలో ఇ-వే బిల్లు విధానాన్ని  కచ్చితంగా అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది.  ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం జరిగిన ఈ సమావేశంలో ఇ-వే బిల్లు విధానాన్ని తప్పని సరిచేస్తూ నిర్ణయం తీసుకుంది.  ఇంట్రా-స్టేట్  ఇ-వే బిల్లు జూన్ 1 నుంచి తప్పనిసరి చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వస్తువుల అంతర్ రాష్ట్ర  ఇ-వే బిల్లు  మాండేటరీ అని జీఎస్‌టీ కౌన్సిల్‌  ప్రకటించింది.  దీన్ని ట్రయల్‌ రన్‌ కోసం జనవరి 16నాటికి సిద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొంది.  

ఇ-వే బిల్లు విధానం,  ఇన్‌వాయిస్‌ మ్యాచింగ్‌  తదితర అంశాలపై చర్చించిన 24వ జీఎస్‌టీ మండలి సమావేశం  ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం  రూ. 50వేల విలువకంటే ఎక్కువ వస్తువులను రవాణా చేస్తే తప్పనిసరిగా ఇ-వే బిల్లు,  రాష్ట్రంలో 10 కి.మీ లోపు వస్తువులను రవాణా చేస్తే ఇంట్రా స్టేట్‌ ఇ-వే బిల్లు  ఉండాలి.

కొన్ని రాష్ట్రాలు ఫిబ్రవరి 1 నుంచి స్వచ్ఛంద ప్రాతిపదికన ఇంటర్-స్టేట్ , ఇంట్రాస్టేట్‌ ఇ-వే బిల్లును అమలు చేస్తాయని కౌన్సిల్‌ తెలిపింది.  అయితే ఇంట్రా స్టేట్‌ ఇ-వే బిల్లు  విధానం మాత్రం ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

కాగా  అంతర్‌ రాష్ట్ర వస్తువుల రవాణా,  పన్నుల ఎగవేత నిరోధాన్ని  ఇ-వే బిల్లు విధానాన్ని జనవరి 1 నుంచి దశలవారీగా..ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి  తీసుకురావాలని గతంలో నిర్ణయించింది. దీనిపై రివ్యూ నిర్వహించిన మండలి ఈ నిర్ణయం అమలు  ఫిబ్రవరికి  ప్రీ పోన్‌  చేసింది.  అలాగే  నవంబరులో గువాహటిలో జరిగిన గత మండలి సమావేశంలో 178 వస్తువులపై పన్ను రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు