హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో రూ.350 కోట్ల నిధుల సమీకరణ

21 Jan, 2017 01:30 IST|Sakshi
హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో రూ.350 కోట్ల నిధుల సమీకరణ

హైదరాబాద్‌: దేశీ మూడో అతిపెద్ద సాధారణ బీమా కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ తాజాగా రూ.350 కోట్లను సమీకరించింది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ విధానంలో నాన్‌–కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీ) జారీ ద్వారా ఈ నిధులను సమీకరించినట్లు సంస్థ పేర్కొంది. వీటి కూపన్‌ రేటు 7.6%గా ఉందని తెలిపింది. ఎల్‌ అండ్‌ టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలు తర్వాత ఈ నిధుల సమీకరణ చేపట్టామని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ సీఈవో రితేశ్‌ కుమార్‌ తెలిపారు.

భవిష్యత్‌ వృద్ధి, మూలధన పెంపు, కంపెనీ ఆర్థిక పటిష్టత కోసం ఈ నిధులను సమీకరించామని పేర్కొన్నారు. ప్రముఖ దేశీ గృహ రుణాల సంస్థ ‘హెచ్‌డీఎఫ్‌సీ’, జర్మనీకి చెందిన మ్యూనిచ్‌ రె గ్రూప్‌ ప్రధాన ఇన్సూరెన్స్‌ సంస్థ ‘ఎర్గో ఇంటర్నేషనల్‌ ఏజీ’ల జాయింట్‌ వెంచరే హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌.

>
మరిన్ని వార్తలు