యూతే టార్గెట్‌: హీరో రెండు స్కూటర్లు 

13 May, 2019 14:43 IST|Sakshi

యూతే టార్గెట్‌: మాస్ట్రో ఎడ్జ్‌, హీరో ప్లెజర్‌ ప్లస్‌  ఆవిష్కరణ

ధరలు : మాస్ట్రో ఎడ్జ్‌   ధర రూ. 62,700(ఎక్స్‌షో రూం  న్యూఢిల్లీ)

మాస్ట్రో ఎడ్జ్‌    మే16వ తేదీనుంచి బుకింగ్స్‌ ప్రారంభం.

 హీరో ప్లెజర్‌ ప్లస్‌ రూ. 49, 300 (ఎక్స్‌షో రూం  న్యూఢిల్లీ)

 బుకింగ్స్‌ జూన్‌ మొదటి వారంలో ప్రారంభం

సాక్షి, ముంబై : ప్రముఖ ద్విచక్ర తయారీదారు  హీరో మోటో కార్ప్‌  మోట్సా​ కొత్త  వాహనాన్ని లాంచ్‌ చేసింది.  మాస్ట్రోఎడ్జ్‌ అనే స్కూటర్‌తోపాటు, ప్లెజర్‌ ప్లస్‌ను అప్‌డేట్‌ చేసి 2019 వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. ప్రధానంగాయువతే టార్గెట్‌గా మాస్ట్రో 125’, ‘ప్లెజర్ 110’ మోడల్ స్కూటర్లను  సోమవారం విడుదల చేసింది. 

హీరో మోటో కార్ప్స్ నుంచి 125 సీసీ స్కూటర్ సెగ్మెంట్‌లో   వస్తున్న స్కూటర్ హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్. 125 సీసీ ఎనర్జీ బూస్ట్ మేకర్ 6750 ఆర్పీఎం వద్ద 8.7 బీహెచ్పీ, 5000 ఆర్పీఎం వద్ద 10.2 ఎన్ఎం టార్క్‌ అందిస్తుంది. 

హీరో న్యూ ప్లెజర్‌ ప్లస్‌ స్కూటర్ ఇది రెండు వేరియంట్లలో లభ్యం.  రీ ఫర్బిష్డ్ హెడ్ ల్యాంప్, టెయిల్ లైట్స్, 102 సీసీ మోటార్ కలిగి ఉంటుంది. ఇది 7000 ఆర్పీఎం వద్ద 6.9 బీహెచ్పీ, 5000 ఆర్పీఎం వద్ద 8.1 ఎన్ఎం టార్క్‌ ఆవిష్కరిస్తుంది.

ధరలు : మాస్ట్రో ఎడ్జ్‌   ధర రూ. 62,700(ఎక్స్‌షో రూం, న్యూఢిల్లీ)

మాస్ట్రో ఎడ్జ్‌  : మే16వ తేదీనుంచి బుకింగ్స్‌ ప్రారంభం.

 హీరో ప్లెజర్‌ ప్లస్‌ రూ. 49, 300 (ఎక్స్‌షో రూం ,న్యూఢిల్లీ)

 బుకింగ్స్‌ జూన్‌ మొదటి వారంలోప్రారంభం కానున్నాయి. 

మరిన్ని వార్తలు