సోషల్‌మీడియా ద్వారా గృహిణుల ఆదాయం తెలిస్తే...

2 Jun, 2017 11:06 IST|Sakshi
సోషల్‌మీడియా ద్వారా గృహిణుల ఆదాయం తెలిస్తే...

ముంబై: సోషల్‌ మీడియాలో గృహిణుల దేశంలో ఆన్లైన్ రిటైల్ మార్కెట్  అభివృద్దిని ఎక్కువగా మహిళలే అందిపుచ్చుకున్నట్టు సర్వేలో తేలింది. ఇ-కామర్స్ బూమను అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నభారతీయ మహిళలు భారీగా  అమ్మకాలు, కొనుగోళ్లు జరుపుతున్నారట.  తాజా నివేదిక ప్రకారం 20లక్షలమంది(2 మిలియన్ల) హోం మేకర్స్‌ సోషల్ మీడియా దిగ్గజాలు  వాట్సాప్‌,  ఫేస్బుక్ ద్వారా  వ్యాపారాన్ని అభివృద్ధి  చేసుకుంటున్నారని లెక్కల్లో తేలింది. దీనికి స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరగడం కూడా కారణమని పేర్కొంది.

వాట్సాప్‌,  ఫేస్బుక్  ప్లాట్‌ ఫాం ల ద్వారా దాదాపు 2మిలియన్ మంది హోమ్మేకర్స్  9 బిలియన్ డాలర్ల ( సుమారు 58వేల కోట్లు) మేర ఆదాయం సమకూర్చుకున్నారని  కన్సల్టింగ్ సంస్థ జిన్నోవ్ ఒక నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా  గృహిణులు లైఫ్ స్టైల్ వస్తువులు, దుస్తులు విక్రయ, పునఃవిక్రయాలు చేస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది.  వివాహ తదితర వివిధ కారణాల రీత్యా  వేర్వేరు ప్రాంతాలకు  బదిలీ అయినా కూడా తమ వ్యాపారాన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాంల ద్వారా  దిగ్విజయంగా  కొనసాగిస్తున్నారని  తెలిపింది. దీంతో ప్రాంతాలు మారినా  ఈ కామర్స్ విధానం వల్ల అమ్మకాలపై ప్రభావం ఉండటంలేదని పేర్కొంది.
 
దేశంలో ఆన్లైన్ రిటైల్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం భారీగా ఉందని ఆ సంస్థ వెల్లడించింది.  ఫ్లిప్‌కార్ట్‌ ,  అమెజాన్ లాంటి ఇ-కామర్స్ మేజర్ల లావాదేవీలు  భారీగా జరుగుతున్నాయని తెలిపింది.  ప్రాథమిక ఇంటర్నెట్ ఉపకరణాల ద్వారా సుమారు 8-9 బిలియన్ డాలర్ల గరిష్ట అమ్మకాలతో వీటి వ్యాపారాన్ని విస్తరణకు తోడ్పడ్డాయని పేర్కొంది. అంతేకాదు 20202 నాటికి ఇది 48-60 బిలియన్  చేరుతుందని కూడా నివేదించింది.  

 

మరిన్ని వార్తలు