హోండా యాక్టివా @ కోటి అమ్మకాలు

19 Aug, 2015 01:34 IST|Sakshi
హోండా యాక్టివా @ కోటి అమ్మకాలు

న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) కంపెనీ యాక్టివా  స్కూటర్ మోడల్ కోటి అమ్మకాల మైలురాయిని సాధించింది. 2001లో ఈ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చామని హెచ్‌ఎంఎస్‌ఐ ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు చెప్పారు. భారత్‌లో స్కూటర్ సెగ్మెంట్‌కు పునరుత్తేజం ఇచ్చిన ఈ మోడల్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉందని వివరించారు. పదేళ్ల క్రితం భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే టూవీలర్‌గా స్కూటర్ మోడల్ నిలుస్తుందని ఎవరూ ఊహించలేదని కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యధ్‌విందర్ సింగ్ గులేరియా చెప్పారు. మార్కెట్లోకి తెచ్చిన  తొలి ఏడాదిలోనే 55 వేల యాక్టివా స్కూటర్లు అమ్ముడయ్యాయని, దేశీయ మార్కెట్లో  గతేడాది 21 లక్షలు అమ్ముడయ్యాయని వివరించారు.

>
మరిన్ని వార్తలు