-

హెచ్‌పీసీఎల్‌ లాభం 147 శాతం అప్‌

10 Nov, 2017 00:27 IST|Sakshi

రెట్టింపైన జీఆర్‌ఎమ్‌

వైజాగ్‌ రిఫైనరీ విస్తరణ కోసం రూ.21 వేల కోట్లు  

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ  హిందుస్తాన్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌ క్వార్టర్లో 147 శాతం వృద్ధి చెందింది. గత క్యూ2లో రూ.701 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,735 కోట్లకు పెరిగిందని హెచ్‌పీసీఎల్‌ తెలిపింది. ఉత్పత్తి అధికంగా ఉండడం, రిఫైనరీ మార్జిన్‌ దాదాపు రెట్టింపుకు పైగా పెరగడం, అధిక ఇన్వెంటరీ లాభాలు, దేశీయ అమ్మకాలు అధికంగా ఉండడం తదితర అంశాల  కారణంగా  ఈ స్థాయి నికర లాభం సాధించామని కంపెనీ సీఎండీ ముకేశ్‌ కె. సురానా చెప్పారు.

ఒక బ్యారెల్‌ చమురును ఇంధనంగా మార్చే విషయంలో గత క్యూ2లో 3.23 డాలర్ల రిఫైనరీ మార్జిన్‌ సాధించామని, ఈ క్యూ2లో అది 7.61 డాలర్లకు పెరిగిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ రిఫైనరీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 8.33 మిలియన్‌ టన్నుల నుంచి 2020 కల్లా 15 మిలియన్‌ టన్నులకు పెంచనున్నామని, దీని కోసం రూ.20,928 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని వివరించారు.

మరిన్ని వార్తలు