-

హెచ్ పీసీఎల్ సీఎండీగా ఏప్రిల్ లో సురానా బాధ్యతలు

19 Feb, 2016 01:26 IST|Sakshi
హెచ్ పీసీఎల్ సీఎండీగా ఏప్రిల్ లో సురానా బాధ్యతలు

న్యూఢిల్లీ: భారత్ మూడవ అతి పెద్ద అయిల్ మార్కెటింగ్ కంపెనీ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) కొత్త సీఎండీగా ముకేశ్ కుమార్ సురానా ఏప్రిల్ 1న బాధ్యతలు చేపడతారు. ఈయన పదవీకాలం ఐదేళ్లు. ప్రస్తుతం సురానా హెచ్‌పీసీఎల్ అనుబంధ కంపెనీ ప్రైజ్ పెట్రోలియం కార్పొరేషన్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత హెచ్‌పీసీఎల్ సీఎండీ నిషి వాసుదేవ పదవీ కాలం మార్చి నెలతో ముగుస్తుంది.

మరిన్ని వార్తలు