భారీ స్ర్కీన్‌, డ్యుయల్‌ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌.. త్వరలో

13 Jan, 2018 10:46 IST|Sakshi

ప్రముఖ మొబైల్‌ సంస్థ హెచ్‌టీసీ 2018 సంవత్సరంలో   తొలి స్మార్ట్‌ఫోన్‌త్వరలోనే లాంచ్‌ చేయనుంది. తాజా నివేదికల ప్రకారంయ ఐ  బ్రాండ్‌లో  హెచ్‌టీసీ యు11ఐ  పేరుతో జనవరి 15న విడదల చేయనుంది.  అమెరికా మార్కెట్‌తో పాటు ఇతర మార్కెట్లలో కూడా ఒకేసారి ప్రవేశపెడుతుందా?లేదా అనేదానికి  ఇంకా క్లారిటి లేదు.  భారీ స్క్రీన్‌, డ్యుయల్‌  సెల్ఫీ  కెమెరాలతో లాంచ్‌ చేయనున్న ఈ డివైస్‌ను  మిడ్‌ సెగ్మెంట్‌ బడ్జెట్‌ ధరలోనే (రూ.32వేలు) కస్టమర్లకుఅందుబాటులో ఉంచనుందని తెలుస్తోంది. బ్లాక్‌, రెడ్‌, సిల్వర్‌ రంగుల్లో లభ్యం కానున్న  ఈ స్మార్ట్‌ఫోన్‌  ఇతర ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి.

హెచ్‌టీసీ యు11ఐ ఫీచర్లు
6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే,  సూపర్ ఎల్‌సీడీ3
1080 x 2160 పిక్సెల్‌ రిజల్యూషన్‌
స్నాప్‌ డ్రాగన్ 652 ప్రాసెసర్
ఆండ్రాయిడ్  నౌగట్‌
4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
డ్యూయల్‌ సెల్ఫీ కెమెరా
3,930ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

మరిన్ని వార్తలు