హెచ్‌టీసీ యూ12ప్లస్‌ లీక్‌: మే 23న లాంచ్‌

12 May, 2018 20:05 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: తైవాన్‌​ మొబైల్స్ తయారీదారు హెచ్‌టీసీ  మరో  ఆకర్షణీయమైన ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. హెచ్‌టీసీ యూ12 ప్లస్‌ పేరుతో  ఒక స్మార్ట్‌ఫోన్ ను ఈ నెల 23వ తేదీన విడుదల చేయనుంది. ఈ ఏడాదిలో  తొలి ఫ్లాగ్‌షిప​ స్మార్ట్‌ఫోన్‌గా చెబుతున్న యూ12 ప్లస్‌ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.  128 జీబీ వేరియంట్‌ సుమారు  రూ.54, 000- 56,300 మధ్య లభ్యం కానుంది.   అలాగే 64జీబీ వేరియంట్‌ ధర  49,500-51,800రూపాయల  మధ్య ఉంటుందని అంచనా.

హెచ్‌టీసీ యూ12 ప్లస్ ఫీచర్లు
6 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
12+16ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా
8+8 ఎంపీ  డ్యుయల్ సెల్ఫీ కెమెరా
3420 ఎంఏహెచ్ బ్యాటరీ

మరిన్ని వార్తలు