హెచ్‌యూఎల్‌ చేతికి ‘ఆదిత్య మిల్క్‌’

7 Aug, 2018 01:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘ఆదిత్య మిల్క్‌’ బ్రాండ్‌ను ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలివర్‌ కొనుగోలు చేయనున్నది. ఈ మేరకు ఆదిత్య మిల్క్‌ బ్రాండ్‌ ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్‌ డిజర్ట్‌లను తయారు చేసే ఈ బ్రాండ్‌ యాజమాన్య సంస్థ, విజయకాంత్‌ డైరీ అండ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని హెచ్‌యూఎల్‌ తెలిపింది.

భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్‌ డిస్సర్ట్‌ మార్కెట్‌లో తమ స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకునే వ్యూహంలో భాగంగా ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేయనున్నామని హెచ్‌యూఎల్‌ సీఎమ్‌డీ, సంజీవ్‌ మెహతా తెలిపారు.   

మరిన్ని వార్తలు