సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ (ఎన్ఏఆర్) ఇం డియా ప్రెసిడెంట్గా హైదరాబాద్కు చెందిన డెవలపర్ సుమంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈయన కాల పరిమితి 2019–2020. నిర్మాణ రంగ సమ స్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విప్లవాత్మక నిర్ణయా లతో రియల్టీ రంగా నికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ఏఆర్లో 13 లక్షల మంది, మన దేశంలో 20 రాష్ట్రాల్లో 30వేల మంది సభ్యులుగా ఉన్నారు. 1908లో చికాగో ప్రధాన కేంద్రంగా ఎన్ఏఆర్ ప్రారంభమైంది.