హ్యుందాయ్‌ క్రెటా విక్రయాల జోరు

28 Feb, 2019 00:50 IST|Sakshi

5 లక్షల మైలురాయిని దాటిన విక్రయాలు

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హుల్యందాయ్‌ మోటార్‌ ఇండియా’.. తన పాపులర్‌ ఎస్‌యూవీ ‘క్రెటా’ విక్రయాలు 5 లక్షల మైలురాయిని దాటినట్లు ప్రకటించింది. 2015 జూలైలో విడుదలైన ఈకారు అమ్మకాలు ఇప్పటివరకు భారత్‌లో 3.7 లక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో 1.4 లక్షలకు చేరుకున్నాయి.

బుధవారం నాటికి మొత్తంగా 5 లక్షలుగా నమోదయ్యాయి. కారు మార్కెట్లోకి విడుదలైన నాలుగేళ్లలోనే ఈ స్థాయి అమ్మకాలు నమోదయ్యాయని సేల్స్‌ హెడ్‌ వికాస్‌ జైన్‌ అన్నారు.   

మరిన్ని వార్తలు