హ్యుందాయ్‌ కొత్త ఎలంట్రా

4 Oct, 2019 10:28 IST|Sakshi

ధరల శ్రేణి రూ. 15.89 లక్షలు–20.39 లక్షలు

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా’ తాజాగా తన ప్రీమియం సెడాన్‌ ‘ఎలంట్రా’ మోడల్‌లో అధునాతన వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ అప్‌డేటెడ్‌ కారు ధరల శ్రేణి రూ. 15.89 లక్షల నుంచి రూ. 20.39 లక్షలు (ఎక్స్‌షోరూం, ఢిల్లీ)గా నిర్ణయించింది. యాంటీ–లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌), ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ (ఈబీడీ) వెనుక పార్కింగ్‌ సెన్సార్లు వంటి ప్రామాణిక భద్రతా ఫీచర్లతో విడుదలైన ఈ అధునాతన వెర్షన్‌.. 2–లీటర్‌ పెట్రోల్‌ పవర్‌ట్రెయిన్, సిక్స్‌–స్పీడ్‌ మాన్యువల్, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మెషీన్లలో అందుబాటులోకి వచ్చింది.

మరిన్ని వార్తలు