న్యూఢిల్లీ: హచ్బ్యాక్ గ్రాండ్ ఐ10 ధరలను ఈ ఏడాది ఆగస్టు నుంచి 3 శాతం వరకు (రూ.14,250–రూ.22,500) పెంచనున్నట్లు హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ప్రకటించింది. ప్రస్తుతం ఈ కారు ధరల శ్రేణి రూ.4.74 – 7.51 మధ్య ఉందని కంపెనీ సీఈఓ వైకే కూ తెలిపారు.
ముడివస్తువుల ధరలు పెరిగిన కారణంగా పెంపు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మోడల్ కారు మినహాయించి కంపెనీకి చెందిన ఇతర కార్ల ధరలు ఏవీ కూడా పెరగడం లేదని స్పష్టం చేశారు. శాంత్రో కారును మళ్లీ మార్కెట్లో ప్రవేశపెట్టాలని కస్టమర్లు, డీలర్ల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందని వెల్లడించిన ఆయన త్వరలోనే ఈ విషయంపై స్పష్టత ఇస్తామని తెలిపారు.