-
టెక్నాలజీ జెయింట్ ఐబీఎం భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసింది. సర్వీసు డివిజన్నుంచి, ముఖ్యంగా సాప్ట్వేర్ సర్వీసుల ఉద్యోగులను 300 మందిని విధుల నుంచి తప్పించింది. సంస్థ పునరుద్ధరణలో భాగంగా, వినియోగదారుల ఆధునిక అవసరాలకనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సామర్ధ్యాలపై ఐబీఎం దృష్టిపెట్టనుంది.
తమ వ్యాపారంలో మారుతున్న అవసరాలు, కస్టమర్లకు ఆధునిక, మెరుగైన సేవలను అందించడంలో సంస్థ సరికొత్త వ్యుహాలతో పనిచేస్తోందని ఐబీఎం అధికార ప్రతినిధి ఒకరు తెలిపారని ఈటీ నౌ రిపోర్టు చేసింది.