ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ దేవరాజరెడ్డికి సన్మానం

16 Feb, 2015 02:09 IST|Sakshi
ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ దేవరాజరెడ్డికి సన్మానం

 సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఎం.దేవరాజరెడ్డికి ఆదివారంనాడిక్కడ ఘనంగా  సన్మానం జరిగింది. ఐసీఏఐ హైదరాబాద్ చైర్మన్  కె.మతేష్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు.   ఐసీఏఐ 65 సంవత్సరాల చరిత్రలో ఒక తెలుగు వ్యక్తి ఈ పదవి దక్కించుకోవడం ఇదే మొదటి సారి.

కాగా, 2016 నుంచి దేవరాజరెడ్డి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. వృత్తిపరమైన అభివృద్ధి, ఆడిటింగ్, నైతిక ప్రమాణాలను మెరుగు పరచి ప్రపంచవ్యాప్తంగా సంస్థకు గుర్తింపు తీసుకువస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.  ప్రపంచంలో రెండవ అతి పెద్ద అకౌంటింగ్ సంస్థ అయిన ఐసీఏఐకు  దేవరాజ రెడ్డి వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులవడం గర్వించదగ్గ విషయమని మతేష్ రెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు