వృద్ధి స్థిరత్వానికి మూడు చర్యలు

30 Jun, 2018 00:53 IST|Sakshi

భారత్‌కు ఐఎంఎఫ్‌ సూచనలు

వాషింగ్టన్‌: భారత్‌ అధిక వృద్ధి రేటు పటిష్టతకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) సంస్థ మూడు సూచనలు చేసింది. 15 రోజులకు ఒకసారి నిర్వహించే విలేకరుల సమావేశంలో శుక్రవారం ఐఎంఎఫ్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ గ్యారీ రైస్‌ మాట్లాడుతూ చేసిన మూడు సూచనలనూ పరిశీలిస్తే...

బ్యాంకింగ్‌ రంగ సంస్కరణలను కొనసాగించాలి. దీనితోపాటు మొండిబకాయిల సమస్య పరిష్కారం తక్షణ ప్రాధాన్యతాంశం. దీనివల్ల రుణ వృద్ధి క్రెడిట్‌ ప్రొవిజనింగ్‌ సామర్థ్యం పెరుగుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలనా వ్యవహారాల పటిష్టత కూడా ముఖ్యం.  
 ప్రభుత్వ ఆదాయ–వ్యయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు లక్ష్యాలను తప్పకూడదు.ఈ విషయంలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను సరళీకరించాలి.
 కార్మిక, భూ వ్యవహారాలకు సంబంధించి కీలక మార్కెట్లలో సంస్కరణలు ముఖ్యం. దీనితోపాటు వ్యాపార సానుకూల పరిస్థితులు పెరగాలి.

మరిన్ని వార్తలు