రికార్డు స్థాయికి ఆదాయపన్ను వసూళ్లు

18 Aug, 2018 02:13 IST|Sakshi

2017–18లో 10.03 లక్షల కోట్లు

గౌహతి: గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్‌ (సీబీడీటీ) వెల్లడించింది. రూ.10.03 లక్షల కోట్ల పన్ను వసూలు జరిగినట్లు తెలిపింది. ఆదాయ పన్ను నిర్వాహకుల రెండు రోజుల సమావేశంలో ఈ విషయాలను సీబీడీటీ అధికారులు వెల్లడించగా.. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 5.61 కోట్ల రిటర్నులు దాఖలు కాగా, గతేడాదిలో 1.31 కోట్లు పెరిగి 6.92 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు తూర్పు జోన్‌ సభ్యులు షబ్రి భట్టాశాలి తెలిపారు. ఈశాన్య ప్రాంతం నుంచి గతేడాదిలో 1.06 కోట్ల నూతన రిటర్నులు జత కాగా, పన్ను వసూళ్లు రూ.7,097 కోట్లుగా ఉన్నట్లు ప్రిన్సిపాల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఎల్‌ సీ జోషి వెల్లడించారు.

మరిన్ని వార్తలు