ఎయిర్‌లైన్స్‌ కంపెనీలకు రూ.4,260 కోట్ల నష్టాలు

14 Dec, 2019 04:41 IST|Sakshi

 2019–20 సంవత్సరంపై సీఏపీఏ తాజా అంచనా

విమానయాన సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 600 మిలియన్‌ డాలర్లకు (రూ.4,260 కోట్లు) పైగా నష్టాలను నమోదుచేయవచ్చని కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ అంచనా వేసింది. 500–700 మిలియన్‌ డాలర్ల వరకు లాభాలకు అవకాశం ఉంటుందని ఈ ఏడాది జూన్‌లో వేసిన అంచనాలను సవరించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ మూసివేత, సానుకూలంగా ఉన్న చమురు ధరల నుంచి ప్రయోజనం పొందడంలో ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు విఫలమైనట్టు సీఏపీఏ తన తాజా నివేదికలో పేర్కొంది.

>
మరిన్ని వార్తలు