భారీగా ధర తగ్గిన సూపర్‌ బైక్స్‌

7 Jul, 2017 20:14 IST|Sakshi



న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రీమియం లగ్జరీ బైకుల ఇండియన్ మోటార్‌ సైకిల్   భారత్‌లో  తన  సూపర్‌  బైక్‌లను భారీగా  తగ్గించింది.  ఇండియాలో జీఎస్‌టీ అమలు నేపథ్యంలో అమెరికా కల్ట్ బైక్ బ్రాండ్ ఇండియన్ మోటార్‌   సైకిల్‌  మూడు మోడళ్ల ధరలపై భారీ  తగ్గింపును శుక్రవారం   ప్రకటించింది.

ఇండియన్ స్కౌట్, ఇండియన్ డార్క్ హార్స్, ఇండియన్ చీఫ్ క్లాసిక్  మూడు మోడళ్ల ధరల తగ్గింపు 9 నుంచి12 శాతం  తగ్గించిందని  ఇండియన్ మోటార్‌సైకిల్ బైక్‌ల  విక్రయ సంస్థ పోలారిస్ ఇండియా వెల్లడించింది.

ఇండియన్ స్కౌట్ మోడల్ ధర  12 శాతానికి తగ్గుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  దీని ప్రకారం రూ. 14.75  లక్షల నుంచి రూ.  12.99లక్షల కు లభ్యంకానుంది.

అదేవిధంగా ఇండియన్ డార్క్ హార్స్ మోడల్ 9 శాతం తగ్గింపు అనంతరం ఇప్పుడు రూ .21.25 లక్షకే  అందుబాటులోఉండనుంది. అసలు ధర రూ. 23.4 లక్షలు.

జిఎస్టి కాలంలో భారతీయ చీఫ్ క్లాసిక్ మోడల్   ధర రూ .21.99 లక్షలుగా ఉంది.  రూ .24.2 లక్షల నుంచి 9.2 శాతం తగ్గించింది.
భారతీయ మోటార్ సైకిల్ భారతదేశంలో మొత్తం తొమ్మిది  మోడల్స్‌ను వి విక్రయిస్తుంది.

కాగా జూలై  1 నుంచి దేశంలో జీఎస్‌టీ పన్నుల రేటు అమల్లోకిరావడంతో వివిధ  కంపెనీలు  ఇప్పటికే వినియోగదారులకు జిఎస్‌టీ ప్రయోజనాలను అందించే లక్ష్యంతో  ధరలను తగ్గించాయి. టాటా మోటార్స్, రెనాల్ట్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా, ఫోర్డ్, మారుతి సుజుకి, టొయోటా జాగ్వార్ ల్యాండ్ రోవర్, బిఎమ్డి, మెర్సిడెస్ బెంజ్, ఆడి కూడా తమ  కార్ల ధరలను తగ్గించాయి. అలాగే హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్, యమహా, సుజుకి మోటార్సైకిల్స్ లాంటి ఇతర ద్విచక్ర వాహన తయారీదారులు  తగ్గింపు ధరలను ప్రకటించిన సంగతి తెలిసిందే.  








 

మరిన్ని వార్తలు