ఎనిమిది నెలల గరిష్టానికి డబ్ల్యుపిఐ

14 Dec, 2017 12:44 IST|Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: నవంబర్ నెలలో టోకు ధరల ఆధారిత  ద్రవ్యోల్బణం మరోసారి భారీగాఎగిసింది. గతనెలల అక్టోబర్‌లో కొద్దిగా చల్లారిన డబ్ల్యుపిఐ  నవంబరు నెలలో 3.93 శాతంగా నమోదైంది. ఆహారం, ఇంధన ధరల పెరుగుదల కారణంగా  డబ్ల్యుపిఐ  ఎనిమిదినెలల గరిష్టాన్ని తాకింది. ఈ మేరకు గురువారం  వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారిక గణాంకాలను విడుదల చేసింది.

 సవరించిన బేస్ సంవత్సరం  2011-12 తో  టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) 2017 నవంబర్ నెలలో 3.93 శాతంగా నమోదైంది. గత నెలల ఇది  3.59 శాతంగా ఉంది.  ఆహారధరల  సూచీ ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ 4.10 శాతం పెరిగింది. గతనెలలో నెల 3.23 శాతం పెరుగుదలను నమోదుచేసింది.

 

మరిన్ని వార్తలు