250 విమానాలకు ఇండిగో ఆర్డర్

17 Aug, 2015 16:17 IST|Sakshi
250 విమానాలకు ఇండిగో ఆర్డర్

న్యూఢిల్లీ: భారత్లో అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో భారీ సంఖ్యలో విమానాలను కొనుగోలు చేస్తోంది. 250 ఎ 320 నియో ఎయిర్క్రాఫ్ట్లకు ఆర్డర్ ఇచ్చింది. ఇండిగో.. ఎయిర్ బస్తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు లక్షా 70 వేల కోట్ల రూపాయలు. ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ ఈ విషయాన్ని వెల్లడించారు.

'ఇండిగో సంస్థ కార్యకలాపాలను విస్తరించడానికి కొత్తగా 250 విమానాలకు ఆర్డర్ ఇచ్చాం. భారత్లో, విదేశాలకు అధిక సంఖ్యలో విమానాలను నడుపుతాం. ఎ 320 నియో ఎయిర్క్రాఫ్ట్లలోనూ ఇప్పటిలాగే  తక్కువ ధరలకు టికెట్లను అందుబాటులో ఉంచుతాం. అంతేగాక ఇండిగో మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పిస్తాం' అని ఆదిత్య ఘోష్ చెప్పారు.

మరిన్ని వార్తలు