ఇండిగోకు కొత్త సీఈవో, ఛైర్మన్‌

24 Jan, 2019 16:57 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్‌ కొత్త సీఈవోను ఎంపిక చేసింది.  రోనోజాయ్‌ దత్తాని సీఈవోగా నియమించామని కంపెనీ గురువారం ప్రకటించింది. అయిదేళ్ల పాటు ఆయన పదవిలో ఉంటారని వెల్లడించింది. అలాగే చైర్మన్‌గా  మేలవీటిల్ దామోదరన్ నియామకాన్ని ఆమోదించింది.  ఈ రెండు నియామకాలు జనవరి 24 నుంచి అమలులోకి వచ్చాయని ఇండిగో  ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా, ఎయిర్‌ సహారా ప్రెసిడెంట్‌ పనిచేసిన దత్తా ఇటీవల ఇండిగో సంస్థలో ప్రిన్సిపల్‌ కన్సల్టెంట్‌గా జాయిన్‌ ​అయ్యారు. అయితే దత్తాకు సీఈవో పదవి కట్టబెట్టనున్నారనే అంచనాల నేపథ్యంలో గత నెలలో అప్పటి సీఈవో గ్రెగ్‌ టేలర్‌​ రాజీనామా చేశారని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి.

మరిన్ని వార్తలు