ఇన్‌ఫినిక్స్‌ నుంచి బడ్జెట్‌ ఫోన్‌ విడుదల

21 Jul, 2020 14:37 IST|Sakshi

ధర రూ.7,999 

జూలై 28 నుంచి ఆన్‌లైన్‌లో అమ్మకాలు

హాంగ్‌కాంగ్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు ఇన్‌ఫినిక్స్‌ భారత మార్కెట్లోకి స్మార్ట్ 4 ప్లస్‌ మోడల్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.7,999గా ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ జూలై 28 నుంచి అమ్మకాలు ప్రారంభవుతాయని కంపెనీ తెలిపింది. ఈ మోడల్‌లో 6.82 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో ఎ25 ప్రాసెస‌ర్‌, 3జీబీ+32 జీబీ ర్యామ్‌ స్టోరేజీ ఆప్షన్‌ను కలిగి ఉంది. ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను ఏర్పాటు చేయగా, వెనకు భాగంలో 8 మెగాఫిక్సెల్‌ కెమెరా అమర్చారు. అలాగే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ డ్యుయ‌ల్ సిమ్‌, మెమొరీ కార్డుల కోసం 3 ప్రత్యేక స్లాట్ల సౌకర్యాలున్నాయి. ఈ స్మార్ట్ 4 ప్లస్ మోడల్‌ స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్‌, ఓషియ‌న్ వేవ్‌, వ‌యొలెట్ రంగుల్లో లభ్యమవుతోంది.  

మరిన్ని వార్తలు