ఫోర్బ్స్‌ అత్యుత్త్తమ జాబితాలో 17 భారత కంపెనీలు

25 Sep, 2019 04:49 IST|Sakshi

3వ స్థానంలో ఇన్ఫోసిస్‌

న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ ఉత్తమ కంపెనీల జాబితాలో 17 భారత కంపెనీలు స్థానం సంపాదించాయి. ‘వరల్డ్‌ బెస్ట్‌ రిగార్డెడ్‌ కంపెనీస్‌’ పేరిట విడుదల చేసిన తాజా జాబితాలో దేశీ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ ఏకంగా 3వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోలి్చతే 31 స్థానాలను మెరుగుపరుచుకుంది. ఇతర భారత కంపెనీల్లో టాటా స్టీల్‌ (105), ఎల్‌ అండ్‌ టీ(115), మహీంద్రా అండ్‌ మహీంద్రా (117), హెచ్‌డీఎఫ్‌సీ (135), బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ (143), పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (149), స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (153) ), హెచ్‌సీఎల్‌ టెక్‌ (155), హిందాల్కో (157), విప్రో (168), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (204), సన్‌ ఫార్మా (217), జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌  (224), ఐటీసీ (231), ఏషియన్‌ పెయింట్స్‌ (248) స్థానాల్లో నిలిచాయి. జాబితాలో అత్యధిక స్థానాలను అమెరికా కైవసం చేసుకుంది. మొత్తం 250 కంపెనీలతో ఈ జాబితా విడుదల కాగా, ఇందులో 59 యూఎస్‌ కంపెనీలే.  ఇక అంతర్జాతీయ చెల్లింపుల సాంకేతిక సంస్థ వీసా టాప్‌లో.. ఇటాలియన్‌ కార్ల  దిగ్గజం ఫెరారీ రెండవ స్థానంలో నిలిచాయి.

మరిన్ని వార్తలు