బీవోఐ ద్వారా ఐటీ రిటర్నులు

25 May, 2015 01:58 IST|Sakshi
బీవోఐ ద్వారా ఐటీ రిటర్నులు

ఖాతాదారులు ఆన్‌లైన్ ద్వారా ఐటీ రిటర్నులు దాఖలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) కల్పిస్తోంది. ఇందుకోసం ‘మై ఐటీ రిటర్న్ డాట్ కామ్’ అనే సంస్థతో ఈ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎటువంటి రుసుములు చెల్లించనవసరం లేకుండా ఉద్యోగులు, ఖాతాదారులు ఈ వెబ్‌సైట్ ద్వారా రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని బీవోఐ జీఎం ఎస్‌ఆర్ మీనా తెలిపారు. ఈ వెబ్‌సైట్ ద్వారా ట్యాక్స్ కాలిక్యులేషన్, ట్యాక్స్ స్టేటస్, రిటర్నులు వంటి సేవలు పొందవచ్చు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా మొబైల్ ఫోన్ ద్వారా కూడా రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు