ఎంఫసిస్‌ బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం

14 Mar, 2017 00:55 IST|Sakshi
ఎంఫసిస్‌ బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం

1.73కోట్ల షేర్ల బైబ్యాక్ @రూ.1,103 కోట్లు
న్యూఢిల్లీ: ఎంఫసిస్‌ సంస్థ షేర్ల బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం లభించింది. 1.73 కోట్ల షేర్లను (8.26% వాటా) బైబ్యాక్‌ చేయడానికి తమ కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపినట్లు సంస్థ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. ఒక్కో షేర్‌ను రూ.635 ధరకు మించకుండా బైబ్యాక్‌ చేస్తామని, ఈ బైబ్యాక్‌  విలువ రూ.1,103 కోట్లని పేర్కొంది. గత ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ కంపెనీలో ప్రమోటర్, ప్రమోటర్‌ గ్రూప్‌కు 60.42% వాటా ఉంది. ప్రజల వద్ద 39.58% వాటా ఉంది.  గత శుక్రవారం బీఎస్‌ఈలో ఈ షేర్‌ స్వల్పంగా నష్టపోయి రూ.573 వద్ద ముగిసింది. ప్రస్తుతం కంపెనీలో మెజారిటీ వాటా పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్‌ చేతిలో ఉంది.

మరిన్ని వార్తలు