అద్భుత ఫీచర్లు, చవక ధర: ఐ వూమీ మొబైల్స్‌

8 Sep, 2017 14:26 IST|Sakshi
అద్భుత ఫీచర్లు, చవక ధర: ఐ వూమీ మొబైల్స్‌

సాక్షి, న్యూఢిల్లీ:  చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, ప్రముఖ మొబైల్‌ మేకర్‌  ఐ వూమీ సరసమైన ధరల్లో రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.  మి సిరీస్‌లో భాగంగా   'మి 3', 'మి 3 ఎస్'  పేరుతో భారత మార్కెట్లో  శుక్రవారం  ప్రవేశపెట్టింది. వీటి ధరలను వరుసగా  రూ .5,499, రూ.6,499 గా నిర్ణయించింది.  రెండు డివైస్‌లు  5.2 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ  షట్టర్‌ డిస్‌  ప్లే,  (పగలని) , 64-బిట్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.1.0,   3000ఎంఏహెచ్‌ బ్యాటరీ ప్రధాన ఫీచర్స్‌గా ఉన్నాయి.
 'మి 3' లో  2జీబీ ర్యామ్‌,  16జీబీ అంతర్గత మెమరీ (128జీబీ దాకా ఎక్స్‌పాండబుల్‌) 8 మెగా పిక్సెల్‌ ముందు, వెనుక కెమెరా విత్‌  ఎల్ఈడి ఫ్లాష్ ఇతర ఫీచర్లు.
‘మి 3 ఎస్‌ ’  లో 3 జీబి ర్యామ్, 32 జీబి ఇంటర్నల్ మెమెరీ, (128 వరకు ఎక్స్‌పాండబుల్‌),  13 మెగా పిక్సెల్‌ రియర్‌ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా విత్‌  ఎల్ఈడి ఫ్లాష్ మిస్‌ 3 ఎస్‌  ఇతర ఫీచర్లుగా ఉన్నాయి.  అలాగే ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు  విక్రయానికి అందుబాటులోఉన్నాయి.
దేశీయ మొబైల్‌ కస్టమర్ల జీవనశైలిని మరింత సులభతరం చేసేందుకు ఫ్లాగ్‌షిప్‌ ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ఆనందంగా వుందని   ఐవూమీ ఇండియా సీఈఓ అశ్వన్ భండారి ఒక ప్రకటనలో తెలిపారు.  


 

మరిన్ని వార్తలు