జైట్లీ బడ్జెట్‌ ప్రసంగం షురూ

1 Feb, 2018 11:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో 2018-19 బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆయన బడ్జెట్‌ ప్రసంగానికి ఉద్యుక్తులయ్యారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ ప్రాధాన్యత సంతరించుకుంది.

జీఎస్‌టీ అమలైన క్రమంలో వస్తున్న తొలి బడ్జెట్‌ కూడా కావడంతో జైట్లీ ఎలాంటి ప్రతిపాదనలతో ముందుకొస్తారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధమయే వేళ ప్రజలను మెప్పించే చర్యలుంటాయా..లేక సంస్కరణలకే కట్టుబడతారా అనేది వెల్లడికానుంది.

మరిన్ని వార్తలు