సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో 2018-19 బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆయన బడ్జెట్ ప్రసంగానికి ఉద్యుక్తులయ్యారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
జీఎస్టీ అమలైన క్రమంలో వస్తున్న తొలి బడ్జెట్ కూడా కావడంతో జైట్లీ ఎలాంటి ప్రతిపాదనలతో ముందుకొస్తారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధమయే వేళ ప్రజలను మెప్పించే చర్యలుంటాయా..లేక సంస్కరణలకే కట్టుబడతారా అనేది వెల్లడికానుంది.