క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత లేదు: జైట్లీ

2 Feb, 2018 00:54 IST|Sakshi

న్యూఢిల్లీ: బిట్‌కాయిన్స్‌ వంటి క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత లేదని, వీటి వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుం దని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. ప్రస్తుతం వర్చువల్‌ కరెన్సీలను నియంత్రించే చట్టాలేమీ దేశీయంగా లేవని, ఈ తరహా కరెన్సీల లావాదేవీలకు ఆర్‌బీఐ ఏ కంపెనీకి అనుమతులివ్వలేదని జైట్లీ గతేడాది పార్లమెంటుకు తెలిపిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు