ఫ్రాన్స్ కేఎల్ఎం, డెల్టా ఎయిర్లైన్స్తో కలసి బిడ్
న్యూఢిల్లీ: తీవ్ర నష్టాల్లో మునిగి ఉన్న ప్రభుత్వరంగ ఎయిర్ ఇండియాను సొంతం చేసుకునేందుకు జెట్ ఎయిర్వేస్, ఫ్రాన్స్ కేఎల్ఎం, డెల్టా ఎయిర్లైన్స్ సంయుక్తంగా పోటీపడనున్నాయి. ఎయిర్ ఇండియాలో వాటాల విక్రయానికి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు (ఈవోఐ) ఆహ్వానించనుంది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్తో కూడిన కన్సార్షియం కూడా బిడ్ వేయనుందని, ఈ మేరకు అవి ఆసక్తితో ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.