న్యూఢిల్లీ: ప్రయాణ సమయంలో విమానం లోపల కనెక్టివిటీ, డేటా సేవలందించేందుకు తమకు అనుమతివ్వాలని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ టెలికం విభాగానికి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఓర్టస్ కమ్యూనికేషన్స్, స్టేషన్ శాట్కామ్, క్లౌడ్ కాస్ట్ డిజిటల్ సంస్థలు ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్)కు ఈ సౌకర్యం కోసం దరఖాస్తులు సమర్చించాయి.
ఈ సేవలు అందించడానికి లైసెన్స్ తప్పనిసరి చేస్తూ గతేడాది డాట్ నిర్ణయం తీసుకోగా.. హ్యూస్ కమ్యూనికేషన్స్ ఇండియా (హెచ్సీఐఎల్) ఫిబ్రవరిలో ఈ తరహా లైసెన్స్ పొంది... దేశంలో తొలి సంస్థగా నిలిచింది. నెల్కోకు చెందిన అనుబంధ సంస్థ టాటానెట్ సర్వీసెస్, భారతీ ఎయిర్టెల్కు పూర్తి అనుబంధ సంస్థగా ఉన్న టెలీపోర్ట్స్ లిమిటెడ్ కూడా ఈ లైసెన్స్లను దక్కించుకున్నాయి.