జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు ప్రారంభం

4 Apr, 2018 00:31 IST|Sakshi

ముంబై: జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని  ఆర్‌బీఐ తాజాగా  పేర్కొంది. 2015 ఆగస్టులో పేమెంట్స్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం పొందిన 11 సంస్థల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా ఒకటి. పేమెంట్స్‌ బ్యాంక్‌గా జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభమయ్యాయని ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ తొలిగా 2016 నవంబర్‌లో పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలను ప్రారంభించింది.  

మరిన్ని వార్తలు