పిస్తా హౌస్‌తో జియో భాగస్వామ్యం

16 May, 2018 22:33 IST|Sakshi

జియోఫోన్ కొనుగోలుపై హలీం డిస్కౌంట్ కూపన్లు

సాక్షి, హైదరాబాద్ : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో నగర వాసులకు ఎంతో ప్రీతిపాత్రమైన హలీంను అందించేందుకు పిస్తా హౌస్ సిద్ధమైంది. ఈ సందర్భంగా పిస్తా హౌస్, రిలయన్స్ జియోలు భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాయి. ఇందులో భాగంగా జియోఫోన్ కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడికి హలీం డిస్కౌంట్ కూపన్లను అందిస్తుంది. వినియోగదారులు ఈ డిస్కౌంట్ కూపన్ తో హైదరాబాద్ లోని కొన్ని ఎంపిక చేసిన పిస్తా హౌస్ కౌంటర్లలో హలీంను కొనుగోలు చేయవచ్చు.

కొనసాగుతున్న ‘జియోఫోన్’ జోరు
ఇంటర్నెట్ సేవలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు 'జియోఫోన్' స్మార్ట్ ఫీచర్ ఫోన్ తో మార్కెట్లో తన జోరును కొనసాగిస్తోంది. కేవలం రూ.49 లకే నెల రోజుల పాటు ఉచితంగా, నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చు. గ‌తంలో ఇతర ఫీచర్‌ ఫోన్‌లను ఉపయోగించి కేవ‌లం వాయిస్ కాల్స్‌ మాత్రమే చేసేవారు. కానీ జియో ఫీచ‌ర్ ఫోన్‌లో వినియోగ‌దారులు వీడియో కాల్స్‌తో పాటు, ఉచిత టీవీ సౌకర్యం కూడా ఆనందిస్తున్నారని జియో తెలిపింది.

మరిన్ని వార్తలు