జియో ఫోన్‌ -2 ముచ్చటగా మూడోసారి

12 Sep, 2018 11:23 IST|Sakshi

జియో ఫోన్‌ -2 ముచ్చటగా మూడోసారి

జియో ఫోన్- 2  థర్డ్‌ ఫ్లాష్ సేల్‌

ధర  రూ.2,999

సాక్షి, ముంబై: రిలయెన్స్ జియో ఫోన్‌ హై-ఎండ్‌ మోడల్‌ జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్‌ ముచ్చటగా మూడోసారి కస్టమర్లను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ రోజు (సెప్టెంబరు12, బుధవారం) మధ్యాహ్నం 12 గంటలకు జియో ఫోన్2  ఫ్లాష్‌సేల్  ప్రారంభం కానుంది.  మొదటి, రెండు  ఫ్లాష్‌సేల్‌  ద్వారా  కొద్ది నిమిషాల్లోనే రికార్డు అమ్మకాలను నమోదు చేసి ఔట్‌ ఆఫ్‌ స్టాక్‌గా నిలిచింది. ఈ సేల్‌ద్వారా జియో ఫోన్ 2 ను బుక్ చేసుకున్న కస్టమర్లకు వారం రోజుల్లోగా ఆ ఫోన్లను డెలివరీ చేయనున్నారు.

జియో 4జీఫోన్లు రెండింటిలోనూ వాట్సాప్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు నిన్న ప్రకటించింది. దీంతో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌,యూట్యుబ్‌లాంటి పాపులర్‌ యాప్‌లన్నీ జియో ఫోన్లలో అందుబాటులోకి వచ్చాయి. కాగా ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తూ, అట్టహాసంగా లాంచ్‌ చేసిన జియో మొదటి ఫోన్‌కు మంచి స్పందన రావడంతో, హై-ఎండ్ మోడల్ జియో ఫోన్-2 ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జియో ఫోన్‌ 2 ధర రూ.2,999 మాత్రమే. క్వెర్టీ కీప్యాడ్, 2.4 అంగుళాల హారిజాంటల్ డిస్‌ప్లే, 4జీ సపోర్ట్‌‌తోపాటు స్టోరేజ్‌ కెపాసిటీని 128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం.

జియో ఫోన్-2 ఫీచర్లు
2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే
512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ వరకువిస్తరించుకునే అవకాశం
2 ఎంపీ రియర్ కెమెరా
వీజీఏ ఫ్రంట్ కెమెరా
2000 ఎంఏహెచ్ బ్యాటరీ

మరిన్ని వార్తలు