ముంబై : శ్రీలంక వేదికగా నేటి( మంగళవారం) నుంచి ప్రారంభమయ్యే భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక ట్రై నేషన్ నిధాస్ ట్రోఫీ డిజిటల్ ప్రసార హక్కులను జియో టీవీ యాప్ సొంతం చేసుకుంది. ఇప్పటికే వింటర్ ఒలింపిక్స్, ఈఎఫ్ఎల్ కప్ మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ప్రసార హక్కులను సొంత చేసుకున్న జియో తాజాగా ట్రై సిరీస్ హక్కులను పొందింది. మార్చి 6 నుంచి 18 వరకు మ్యాచ్ల ప్రత్యక్షప్రసారంతో పాటు రిపీట్, హైలెట్ ప్యాకేజిలు అందజేయునున్నట్లు కంపెనీ పత్రికా ప్రకటనలో వెల్లడించింది.