జూబిలంట్ లైఫ్సెన్సైస్ లాభం 22 శాతం అప్

11 Aug, 2016 01:33 IST|Sakshi
జూబిలంట్ లైఫ్సెన్సైస్ లాభం 22 శాతం అప్

న్యూఢిల్లీ: జూబిలంట్ లైఫ్‌సెన్సైస్ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 22 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.132 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.162 కోట్లకు పెరిగిందని జూబిలంట్ లైఫ్‌సెన్సైస్ తెలిపింది. ఫార్మా సెగ్మెంట్లో అమ్మకాలు జోరుగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని జూబిలంట్ లైఫ్ సెన్సైస్ చైర్మన్ శ్యామ్ ఎస్. భర్తియ తెలిపారు. నికర అమ్మకాలు రూ.1,401 కోట్ల నుంచి రూ.1,426 కోట్లకు పెరిగాయని వివరించారు.

మరిన్ని వార్తలు