బెంగళూరులో కల్యాణ్‌ జువెలర్స్‌ కొత్త షోరూం 

10 Aug, 2018 01:44 IST|Sakshi

ఐటీ సిటీ బెంగళూరులోని మారతహళ్లిలో తన కొత్త షోరూమ్‌ను కల్యాణ్‌ జ్యువెలర్స్‌ ప్రారంభించింది. సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్లు హీరో అక్కినేని నాగార్జున, కన్నడ హీరో శివరాజ్‌ కుమార్‌ కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీఎత్తున అభిమానులు తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో కల్యాణ్‌ జ్యువెల్లర్స్‌ చైర్మన్, ఎండీ టీఎస్‌ కల్యాణరామన్, ఈడీ రమేశ్‌ కల్యాణరామన్‌ పాల్గొన్నారు. బెంగళూరులో కల్యాణ్‌ జ్యువెల్లర్స్‌ తన తొలి షోరూమ్‌ను 2010లో ప్రారంభించింది. ప్రస్తుతం మారతహళ్లి శాఖతో కలుపుకుని కర్ణాటక వ్యాప్తంగా 14 షోరూమ్‌లు ఉన్నాయి.    

మరిన్ని వార్తలు