డ్యూక్ 790 స్పోర్ట్స్‌ బైక్‌‌.. ధరెంతో తెలుసా..!!

23 Sep, 2019 18:48 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆస్ట్రియా దేశానికి చెందిన స్పోర్ట్స్‌ బైక్స్‌ తయారీ సంస్థ కేటీఎమ్‌.. అధునాతన ‘డ్యూక్ 790’  బైక్‌ను సోమవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 799 సీసీ ఇంజిన్‌ సామర్థ్యం గల ఈ బైక్‌ ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర రూ.8.64 లక్షలుగా కంపెనీ పేర్కొంది. దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లో.. బెంగుళూరు, ముంబై, పుణె, హైదరాబాద్‌, సూరత్‌, ఢిల్లీ, కోల్‌కత, చెన్నై, గువాహటిల్లో డ్యూక్ 790 బైక్‌ను ఈ రోజు నుంచే బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ అధికారులు తెలిపారు. క్రోమియం మాలిబ్డినం స్టీల్ ఫ్రేమ్‌తో మిరుమిట్లు గొలుపుతున్న ఈ బైక్‌పై ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నట్టు బజాజ్‌ ఆటో ఫిన్‌కార్ప్‌ తెలిపింది. 1.70 లక్షల డౌన్‌పేమెంట్‌తో, నెలకు రూ.19 వేలు ఈఎంఐతో బైక్‌ను సొంతం చేసుకోవచ్చని వెల్లడించింది. గతేడాది డ్యూక్‌ 200 బైక్‌ను కేటీఎమ్‌ మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు