వైజాగ్లో లలితా జువెలరీ మెగా షోరూమ్

15 Jul, 2016 01:49 IST|Sakshi
వైజాగ్లో లలితా జువెలరీ మెగా షోరూమ్

హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ ‘లలితా జువెలరీ’ ఈ నెల 21న వైజాగ్‌లో మెగా షోరూమ్‌ను ప్రారంభిస్తోంది. నగరంలోని ద్వారకానగర్ ఆర్‌టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటైన ఈ షోరూమ్ విస్తీర్ణం 75,000 చదరపు అడుగులు ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ షోరూమ్‌లో విభిన్నమైన ఆధునాతన డిజైన్లతో కూడిన బంగారు ఆభరణాలు, హాల్‌మార్క్ ధ్రువీకృత నగలు, ఐజీఐ సర్టిఫైడ్ వజ్రాభరణాలు, సమకాలీన వెండి వస్తువులు, ఫ్యాషనబుల్ స్టోన్స్ వంటి తదితర వస్తువులు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని వివరించింది. వీటితోపాటు కస్టమర్లకు సరళమైన కొనుగోలు పథకాలను కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నామని సంస్థ చైర్మన్, మేనే జింగ్ డెరైక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు