జీఎస్‌టీ రిటర్న్స్‌ ఫైలింగ్‌ గడువు మరోసారి పెంపు

30 Oct, 2017 20:37 IST|Sakshi

న్యూఢిల్లీ: జీఎస్టీ ఫైలింగ్‌కు గడువును  ప్రభుత్వం  మరోసారి పెంచింది. జులైలో కొనుగోళ్లు, ఇన్పుట్-అవుట్పుట్ లావాదేవీల కోసం జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీ రిటర్న్‌ దాఖలు సోమవారం మరోనెలపాటు పొడిగిస్తూ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది.    అక్టోబర్‌28న బెంగళూరులో జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుతెలిపింది.  జీఎస్‌టీ -2 రిటర్న్‌కు నవంబర్‌ 30 అని జీఎస్‌టీఆర్‌-2  దాఖలుకు చివరి తేదీ డిసెంబర్‌ 11 అని ట్విట్టర్‌లో వెల్లడించింది. 

అక్టోబర్ 31 నుంచి గడువు కొనుగోలు రిటర్న్ లేదా జీఎస్‌టీఆర్‌-2 గడువును నవంబర్‌ 30వరకు, ఇన్పుట్-అవుట్‌పుట్ లావాదేవీల  జీఎస్‌టీఆర్‌ 3 దాఖలును  డిసెంబర్‌ 11 వరకు  అవకాశం కల్పిస్తున్నట్టు ట్వీట్‌ చేసింది.  

గతంలో ఆడిట్ చేసిన ఆదాయం పన్ను రాబడిల సమర్పణకు  జీఎస్‌టీ-2 దాఖలు చేసిన గడువు ముగియడంతో కొంతమంది పన్ను చెల్లింపుదారులపై ఒత్తిడి తెచ్చిందని క్లియర్ టాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆర్చిత్‌ గుప్తా తెలిపారు. ఇన్పుట్ పన్ను క్రెడిట్ లభ్యత దానిపై ఆధారపడి ఉండటం వలన ఇది  అత్యంత ముఖ్యమైందన్నారు.

మరిన్ని వార్తలు