తొలి ఆండ్రాయిడ్‌ గో స్మార్ట్‌ఫోన్‌: బడ్జెట్‌ ధరలో

27 Feb, 2018 14:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ హ్యాండ్సెట్ తయారీదారు లావా తొలి ఆండ్రాయిడ్‌ ఓరియో గో  4జీ  స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది.  లావా జెడ్‌ 50  పేరుతో  దీన్ని లాంచ్‌ చేసింది. బడ్జెట్‌ ధరలో ఎంట్రీ లెవల్‌లో 1జీబీ ర్యామ్‌ డివైస్‌లకుద్దేశించిన కొత్త  ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్ సిస్టం (గో ఎడిషన్‌)  మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  దీని ధరను  5వేల రూపాయలుగా నిర్ణయించింది.

లావా జెడ్‌ 50 ఫీచర్లు
4.5 అంగుళాల  డిస్‌ప్లే, 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌
ఆండ్రాయిడ్‌ ఓరియో  గో
1.1 గిగాహెట్జ్ క్వాడ్ కోర్
1 జీబీ ర్యామ్
8 జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌
5ఎంపీ రియర్‌ కెమెరా
5ఎంపీ  సెల్ఫీ కెమెరా విత్‌  ఫ్లాష్

మరిన్ని వార్తలు