లెనోవో ధర పడిపోయిందోచ్!

26 Apr, 2016 19:01 IST|Sakshi
లెనోవో ధర పడిపోయిందోచ్!

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవో తన వైబ్ సిరీస్ మొబైల్ ధరను భారీగా తగ్గించింది. సెల్సీల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వైబ్ ఎస్1ను గత నవంబర్ నెలలో రూ.15,999/- ధరతో మార్కెట్లోకి విడుదలైంది. ఆండ్రాయిడ్ 5.0తో అందుబాటులో ఉన్న ఈ ఫోన్లో 5అంగుళాల స్క్రీన్, 8 మెగా పిక్సల్ రీర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాలు ఇందులో ఉన్నాయి. ఫోటోల కోసం ప్ర్తత్యేకంగా ఫోటో ఎడిటింగ్ ఫీచర్ను అందుబాటులో ఉంచారు. 64 బిట్, 1.7జీహెచ్జడ్ ఆక్టాకోర్  మీడియా టెక్ ప్రాసెసర్ను ఇందుకు జత చేశారు. 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో లభ్యమయ్యే ఈ మొబైల్ను 128 జీబీ సామర్ధ్యం వరకు విస్తరించుకోవచ్చు.

ఎస్ 1 ధరను రూ.15,999/- నుంచి రూ.12,999/-కు తగ్గిస్తున్నట్లు లెనోవో ఇండియా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. మార్చిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది.

మరిన్ని వార్తలు