ఎల్ఐసీ జోనల్ మేనేజర్ గా సుశీల్ కుమార్

28 Apr, 2016 02:17 IST|Sakshi
ఎల్ఐసీ జోనల్ మేనేజర్ గా సుశీల్ కుమార్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ సౌత్ సెంట్రల్ జోన్‌కి కొత్త జోనల్ మేనేజర్‌గా (ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ క్యాడర్‌లో) టీసీ సుశీల్ కుమార్ విధుల్లో చేరారు. ఈ నెల 20న ఆయన బాధ్యతలు చేపట్టినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎల్‌ఐసీ కార్యకలాపాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో కస్టమర్ రిలేషన్స్ మేనేజ్‌మెంట్ విభాగం ఈడీ హోదాలో సుమారు రూ. 2 లక్షల కోట్ల వార్షిక రెన్యువల్ ప్రీమియం అందించే 30 కోట్ల పైగా కస్టమర్ల పోర్ట్‌ఫోలియోను పర్యవేక్షించారు.

మరిన్ని వార్తలు