ఇక మహీంద్రా మధ్యతరహా ట్రక్కులు

25 Jul, 2018 00:28 IST|Sakshi

మార్కెట్లోకి ‘ఫూరియో’ విడుదల

ముంబై: మహీంద్రా ట్రక్‌ అండ్‌ బస్‌ నుంచి కొత్తగా మధ్యతరహా వాణిజ్య వాహనం(ఐసీవీ–ఇంటర్‌మిడియట్‌ కమర్షియల్‌ వెహికల్‌) విడుదలైంది. ’మహీంద్రా ఫూరియో’ పేరుతో విడుదలైన ఈ ఐసీవీ ద్వారా అన్ని విభాగాల వాణిజ్య వాహనాలలో గ్రూప్‌ ఉనికిని చాటుకుంటుందని మహీంద్రా అండ్‌ మహీంద్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా అన్నారు.

ఈ విభాగం కోసం రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఐసీవీ విభాగంలో 21 నూతన ట్రక్కును ప్రవేశపెట్టనున్నామని, వీటిలో 6 ట్రక్కులను ఏడాదిలోనే విడుదలచేయనున్నామని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు