మలబార్‌ గోల్డ్‌ ‘బ్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’

23 Apr, 2019 01:37 IST|Sakshi

7వ ఎడిషన్‌ ప్రారంభం

బెంగళూరు: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌.. ‘బ్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో తన నూతన కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చింది. పెళ్లిళ్ల సీజన్‌లో విభిన్న వివాహ ఆభరణాలను పరిచయం చేసే ఈ ప్రచార కార్యక్రమ 7వ ఎడిషన్‌ సోమవారం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా సంస్థ చైర్మన్‌ ఎంపీ అహ్మద్‌ మాట్లాడుతూ.. ‘నూతన వధూవరులకు నచ్చే విధంగా కొత్త హంగులతో కూడిన ప్రత్యేక ఆభరణాలను ఈ కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉంచాం. భిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతుల వివాహ ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి’ అని తెలిపారు.  

మరిన్ని వార్తలు